మైలవరం సీఐ పి.శ్రీను మెట్రో దినసూచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మెట్రో యాజమాన్యాన్ని, మైలవరం మెట్రో టీవీ జర్నలిస్టు శివ రామ కృష్ణ కు అభినందనలు తెలిపారు. కేబుల్ నెట్వర్క్ లో మెట్రో తన వార్తా స్రవంతిని నిరంతరం కొనసాగిస్తూ ఎలక్ట్రానిక్ మీడియా లో ఉన్నత స్థానానికి ఎదుగడానికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల మద్య క్యాలెండర్ ఆవిష్కరించిన ఆయన అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జబ్బార్, సీనియర్ పాత్రికేయులు మురళి, రాజా రెడ్డి, రామారావు, వైడీపీ రెడ్డి, జర్నలిస్టు సంఘం నాయకులు చైతన్య ప్రెస్ క్లబ్ సభ్యులు, గ్రామ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.