పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సుబ్రతా ముఖర్జీ (75) మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఎస్ఎస్కేఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి కన్నుమూశారు.
వారం రోజుల కిందట శ్వాస సంబంధమైన ఇబ్బందులు తలెత్తడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన మరణ వార్త విన్న వెంటనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే ఆస్పత్రికి వెళ్లారు.