తెలంగాణ సాయుధ పొరాట చరిత్రలో తిరుగులేని నాయకురాలుగా ఉన్నత స్థాయికి ఎదిగిన వీర తెలంగాణ కన్న ధీర వనిత మల్లు స్వరాజ్య మని, తెగువకి,తెగింపుకి ఆమె ఒక చిరునామా అని, మహిళ లోకానికి మల్లు స్వరాజ్యం స్ఫూర్తి అని హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
చరమాంకం లోను నమ్మిన సిద్దాంతమే గొప్పదని చూపిన వీర తెలంగాణ బిడ్డ మల్లు స్వరాజ్యం మని, రాజీలేని పోరాటానికి ఆమె జీవితమే ఉదాహరణ అని,ఆమె లేని లోటు తీర్చలేనిదని అన్నారు.
తెలంగాణ సాయుధ పోరాట ధీర వనిత,మాజీ శాసన సభ్యురాలు, సీనియర్ మహిళ నాయకురాలు మల్లు స్వరాజ్యం మరణం పట్ల శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి తన ప్రగాఢ సంతాపం తెలియజేసారు. ఈ సందర్భంగా సైదిరెడ్డి మల్లు స్వరాజ్యం పోరాట పటిమను,సాయుధ తెలంగాణ తిరుగుబాటులో ఆమె తెగింపుని స్ఫూర్తిని కొనియాడారు. చివరి దశ వరకు నమ్మిన సిద్దాంతం పట్ల అంకితభావంతో పని చేశారని అన్నారు. ఆమె జీవితం ఎందరో మహిళలకు ధైర్యం,స్ఫూర్తిని ఇస్తుంది అన్నారు. సమాజానికి మల్లు స్వరాజ్యం లేని లోటుని తిరిగి పూడ్చలేమని,ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు సైదిరెడ్డి తెలిపారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్