31.7 C
Hyderabad
May 2, 2024 09: 30 AM
Slider నల్గొండ

శాసనసభ్యుడు సైదిరెడ్డి ని సన్మానించిన గిరిజన నాయకులు

#mlasaidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో సోమవారం  గిరిజన నాయకులు బంజారా భవన్ నిర్మాణం త్వరతగతిన పూర్తి చేయించినందుకు, హుజుర్ నగర్ ఔటర్ రింగ్ రోడ్ నిర్మణానికి తెలంగాణ ప్రభుత్వం నుండి ఫండ్ ను విడుదల చేయించినందుకు అభినందనలు తెలుపుతూ శాసనసభ్యుడు సైదిరెడ్డి ని సన్మానించారు.

ఈ సందర్భంగా గిరిజన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, న్యాయవాది నగేష్ రాథోడ్ మాట్లాడుతు హుజుర్ నగర్ శాసనసభ్యుడు సైదిరెడ్డి  కృషి వలన బంజారా భవన్ నిర్మాణం త్వరిత గతిన పూర్తి అయినదని,వారి కృషి వల్ల ఓటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి నిధులు విడుదల అయినాయని అన్నారు. అదేవిదంగా మట్టపల్లి పుణ్య క్షేత్రం నందు గిరిజన జాతి వారి కోసం సత్ర నిర్మాణం కొరకు తెలంగాణ ప్రభుత్వం నుండి నిధులు విడుదల చేయించడానికి కృషి చేయాలని కోరారు. శాసనసభ్యుడు సైదిరెడ్డి ని అభ్యర్ధించగా సూముఖతను వ్యక్తపరిచినట్లు ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమం లో మఠంపల్లి ఎంపిపి పార్వతి కొండా నాయక్,నియోజకవర్గ సేవాలాల్ జయంతి కన్వీనర్ వెంకటేశ్వర్లు నాయక్,నాగు నాయక్, రవీందర్ నాయక్,బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

అందరికి వ్యాక్సిన్ ఇచ్చిన ప్రధాని మోడీకి పాలాభిషేకం

Satyam NEWS

బస్తీ దావాఖన ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

Bhavani

పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యేపై పార్టీనేతల తిరుగుబాటు

Satyam NEWS

Leave a Comment