సిబిఐటి కళాశాల లో చైతన్య సత్త్వ, యుహెచ్ యూ సెల్ ఆధ్వర్యం లో ప్రపంచ మానవ విలువల దినోత్సవం నేడు ఘనం గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా మైండ్ బీన్స్ ఇండియా వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఆదిరాజు రఘురాం గారు విచ్చేసి ఉపన్యాసం చేశారు. రఘురాం మాట్లాడుతూ సృష్టికర్త బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉందని అని చెప్పారు. మానవత్వ విలువలు అనుసరించటం ద్వారా మన ప్రతి అవసరం నెరవేరుతుందని తెలిపారు.
మనం శ్రీ మహా విష్ణువు నుండి విలువలను నేర్చుకోవాలి. విష్ణువు జీవన విధానంతో వ్యవహరిస్తాడు. జీవిలో విలువలను పెంపొందించుకుంటాడు. దాతలు ఇతరుల అభిప్రాయాలు ఎంపికల ద్వారా ప్రభావితమవుతారని కూడ పేర్కొన్నారు. జీవితం లో మనం ఒత్తిడికి గురికాకూడదు. మనం ఆనుకొన్న దానిని సాధించడానికి నారాయణుని మీద శ్రద్ధ వహించమని చెప్పారు. అప్పుడు లక్ష్మి దేవి ఎల్లప్పుడూ అనుసరిస్తుంది అని వివరించారు. కళాశాల సిబ్బంది ప్రొఫెసర్ జగన్నాధరావు, ప్రొఫెసర్ జి సురేశ్బాబులు మానవతా విలువల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఫ్రంట్లైన్ కార్మికుల సిబ్బందిని సన్మానించారు.