23.2 C
Hyderabad
May 7, 2024 22: 30 PM
Slider ఆధ్యాత్మికం

శ్రీవారి సేవ‌లో ఎంపీ సీఎం

tirumala

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ బుధ‌వారం ఉదయం శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. ముందుగా ఆలయం వ‌ద్ద‌కు చేరుకున్న శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌కు టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగతం పలికారు.
స్వామివారి ద‌ర్శ‌నానంతరం శ్రీ వకుళామాతను, ఆలయ ప్రదక్షిణగా వచ్చి శ్రీ విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, శ్రీ యోగనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో చౌహాన్‌కు వేద‌పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంత‌రం అద‌న‌పు ఈఓ స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు.
నాద‌నీరాజ‌నం వేదికపై జ‌రిగిన సుంద‌ర‌కాండ పారాయ‌ణంలో శివ‌రాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో గోపినాథ్ జెట్టి, బోర్డు మాజీ స‌భ్యులు భానుప్ర‌కాష్‌రెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్ జగన్ మోహనాచార్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

ఆస్టేలియాలో హిందూ దేవాలయంపై మరో సారి దాడి

Satyam NEWS

తనిఖీల్లో వలంటీర్ హాజరు శాతంపై మండిపడ్డ కలెక్టర్..

Satyam NEWS

ఎం‌పి రవి కార్యాలయంపై ఈడి దాడులు

Murali Krishna

Leave a Comment