39.2 C
Hyderabad
May 3, 2024 13: 49 PM
Slider నల్గొండ

హుజూర్ నగర్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన

#Uttamkumar Reddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని హరిజనవాడ 11వ,వార్డులో కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కాస్తల శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన,ప్రారంభోత్సవాలను నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తంకుమార్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు.


(జంగిడి) యాదవ బజారులో 5 లక్షల రూపాయల సిసి రోడ్డు శంకుస్థాపన, తదనంతరం 3 లక్షల రూపాయలతో నిర్మించిన ఎస్సీ కమిటీ హాల్ ను ప్రారంభించి,హరిజన వాడలోని కాంగ్రెస్ పార్టీ కుటుంబాల ఇళ్ళకు వెళ్లి వారి యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హుజూర్ నగర్ నియోజకవర్గం తాను శాసనసభ్యుడుగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ప్రస్తుతం ఎటువంటి అభివృద్ధి జరగటం లేదని అన్నారు.ప్రస్తుతం ఉన్న నాయకులు దోచుకోవడం,దాచుకోవడం మీద శ్రద్ధ చూపుతున్నారని,వారికి అభివృద్ధి గురించి పట్టదని,మిల్లర్ల దగ్గర లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని విలేకరుల సమావేశంలో తెలియజేశారు.


కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జునరావు, ఐ ఎన్ టి యు సి రాష్ట్ర నాయకుడు,జిల్లా అధ్యక్షుడు అధ్యక్షుడు యరగాని నాగన్న గౌడ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గల్లా వెంకటేశ్వర్లు,సాముల శివారెడ్డి, దొంగర వెంకటేశ్వర్లు,ఎండి నిజాముద్దీన్, బాచిమంచి గిరిబాబు,భూక్యా మంజు నాయక్,కౌన్సిలర్లు తేజవత్ రాజా నాయక్, కోతి సంపత్ రెడ్డి,కారింగుల వెంకటేశ్వర్లు, వెలిదండ వీరారెడ్డి,జక్కుల మల్లయ్య, వేముల వెంకన్న,బుల్లెద్దు జైలు,వేముల నాగరాజు హరిజనవాడ ముఖ్య నాయకులు ఎడవల్లి వీరబాబు, మేళ్లచెరువు ముక్కంటి,కస్తాల ముత్తయ్య, కస్తాల పెద్ద సైదులు,కస్తాల రవీందర్,కస్తాల సైదులు,రేడపంగు రాము,క్రాంతి కుమార్, మాజీ సర్పంచ్ దేవరంగరెడ్డి కుటుంబ సభ్యులు అత్యధిక సంఖ్యలో హరిజనవాడకు చెందిన కాంగ్రెస్ పార్టీ అభిమానులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

సామాజిక దూరం పాటించి నిత్యావసర సరుకులు కొనాలి

Satyam NEWS

సమాచార హక్కు రక్షణ చట్టం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

డొనేషన్: రేషన్ బియ్యాన్ని విరాళంగా ఇవ్వండి

Satyam NEWS

Leave a Comment