పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం మారేడుకోట పంచాయతీ ఎగువ జీడి పాలెం గ్రామానికి చెందిన సవర భాస్కరరావు భార్య కేశమ్మ గత కొద్ది రోజులు క్రితం మరణించడంతో విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజిక వేత్త మామిడి గోవిందరావు ఆ కుటుంబానికి ఎంజీఆర్ శ్రేణుల ద్వారా 10,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు అలాగే గోపినాథపురం గ్రామానికి చెందిన నగరంపల్లి కాంతమ్మ పెరాలసిస్ తో గత కొద్ది రోజులుగా బాధపడుతున్నారు ఆ కుటుంబానికి 5,000/- వేలు రూపాయలు ఎంజీఆర్ శ్రేణులు ద్వారా అందజేశారు ఎంజీఆర్ శ్రేణులు మాట్లాడుతూ నిస్వార్థ ప్రజానాయకుడు
నిరుపేదలకు అభయహస్తం ఇస్తున్న నాయకుడైన మామిడి గోవిందరావు సేవలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు కార్యక్రమంలో పట్టుపురం ఎంపీటీసీ ప్రతినిధి నంబాల వెంకట రావు, ఎల్ ఎన్ పేట మండల నాయకులు వెలమల గోవిందరావు, గోక మోహన్ రావు జమ్మన బైరాగి నాయుడు జమ్మన పాపారావు,కే జోగారావు, పతివాడ నాగేశ్వరరావు, తామర మాజీ సర్పంచ్ సిరిపురం బాబురావు, వాలిపల్లి వెంకట రావు, బిల్లింగి భాస్కరరావు, నగరంపల్లి ఆదినారాయణ, నగరంపల్లి రాము, నగరంపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు.