29.7 C
Hyderabad
May 7, 2024 05: 19 AM
Slider నల్గొండ

జర్నలిస్టుల సమస్యలపై ఐజేయు పోరాటాలు

#iju

జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయాలని టి యు డబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ చౌదరి, ప్రధాన కార్యదర్శి కోలా నాగేశ్వరరావు అన్నారు. గురువారం హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణంలో ఈ నెల చివరి వారంలో టియుడబ్ల్యూజే జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

జిల్లా మహాసభకు స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి, నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జగదీశ్వర్ రెడ్డి,ఎమ్మెల్సీలను  ఆహ్వానించనున్నట్లు వారు తెలిపారు.జిల్లా వ్యాప్తంగా యూనియన్ కి సంబంధించి ఇప్పటికే సభ్యత్వ నమోదు పూర్తి చేసినట్లు వెల్లడించారు.జిల్లా మహాసభను యూనియన్ ప్రతినిధులందరూ విజయవంతం చేయాలని చలసాని శ్రీనివాస్,కోలా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.జాతీయ కౌన్సిల్ సభ్యుడుగా ఎన్నికైన చలసాని శ్రీనివాస్ చౌదరిని యూనియన్ ప్రతినిధి వర్గం ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు నూకల నరేందర్రెడ్డి,బసవోజు శ్రీనివాస చారి,రాంప్రసాద్,దేవరం రామిరెడ్డి, వెంకటరెడ్డి,దయాకర్ రెడ్డి,కీత రామనాథం పి.భాస్కర్,జానీ,అంజి,పిల్లలమర్రి శ్రీనివాసు,టీవీయల్,శేషం రాజు, రామకృష్ణ,రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

కొల్లాపూర్ లో ఘనంగా పూలే జయంతి వేడుకలు

Satyam NEWS

సమ్మిడి వీరారెడ్డి స్మారక మెరిట్ స్కాలర్షిప్ ప్రదానోత్సవం

Satyam NEWS

వనపర్తిలో ఆసుపత్రి, ల్యాబులు తనిఖీ

Satyam NEWS

Leave a Comment