నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా నిర్వహించారు.
పెంట్లవెల్లి యువత ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం TSU రాష్ట్ర ఉపాధ్యక్షులు వంగ భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ మనిషిని మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే అని నమ్మి ఆచరణాత్మకంగా చూపించిన గొప్ప మేధావి పూలే అని అన్నారు. అదే విధంగా సమాజంలోని కుల వివక్షను, అన్యాయాలను రూపుమాపేందుకు తన జీవితాన్ని ధారపోసిన మహోన్నత వ్యక్తి, అక్షరమే ఆయుధమని నినదించిన గొప్ప సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పూలే ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి దాయకమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బలరామ కృష్ణయ్య, అర్జున్ గౌడ్, పలువురు ఉపాధ్యాయులు, పెంట్లవెల్లి యువత, జంగం నరేష్, మూలే సురేష్, ఏటూరి శివ, నవీన్ గౌడ్, సుమంత్, మేకల శివ యాదవ్ పాల్గొన్నారు.