హైదరాబాద్ లోని నల్లకుంట డివిజన్ విద్యా నగర్ లోని ఆంధ్ర మహిళా సభ దుర్గాబాయి దేశ్ ముఖ్ హాస్పిటల్ లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కంటి స్క్రీనింగ్ క్యాంపు ను అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ నేడు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఆరోగ్య కేంద్రంలోని ఆశా వర్కర్లకు ప్రభుత్వం తరపున ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆంధ్ర మహిళా సభ ఉద్యోగుల యూనియన్ వారు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి ఆసుపత్రి ఆవరణలో 5/- రూపాయల భోజన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తి పట్ల వెంటనే సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలో 5/- రూపాయల భోజన కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు అవంతి, ప్రణీత్, నల్లకుంట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు మేడి ప్రసాద్, భాస్కర్, నాయకులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట