ఏపీలోని ఇటీవల తరచూ జరుగుతున్నదారుణాలలో వావి వరుసలు మరిచిపోయి ప్రవర్తించడమే కారణంగా నిలుస్తోంది. విషయం బయటకు తెలిసిపోతుందేమోనని హత్యలు చేసి…పోలీసులకు సవాళ్ళ విసురుతున్నారు.
రాష్ట్రంలోని త్వరలో పరిపాలన రాజధానిగా అవ్వబోతున్నవిశాఖ జిల్లాకు ఆనుకుని ఉన్నవిజయనగరం జిల్లా కేంద్రంలో మూడు రోజుల క్రితం జరిగిన హత్య కేసులో ఇలాంటి పరిశోధనే పోలీసుల దర్యాప్తు లో తేలినట్టు సమాచారం.
వన్ టౌన్ లిమిట్స్ పరిధి గణేష్ నగర్ సమీపం గంజిపేట వద్ద జరిగిన హత్య కేసు దర్యాప్తు ను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. జరిగిన దారుణాన్ని సీరియస్ గా తీసుకున్నవన్ టౌన్ సీఐ మురళీ…తన బృందంతో నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో.. వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. హతుడి భార్యను స్టేషన్ కు పిలిపించి విచారించారు. ఆమె చెల్లెలిని కూడా అదుపులో తీసుకుని ప్రశ్నించారు. మైనర్ అయిన చెల్లెలు, హత్యకు గురైన వ్యక్తి భార్యను తమదైన శైలిలో పోలీసులు విచారిస్తున్నారు.
అయితే హత్య జరిగిన మూడు రోజులు కావస్తున్నా…అందుకు కారకులను పట్టుకోవడంలో పోలీసులు కాస్త సీరియస్ గానే విచారణ చేస్తున్నారు. ఏదైనా వన్ టౌన్ సీఐగా బాధ్యతలు చేపట్టిన మురళీ తన పరిధిలో జరిగిన మర్డర్ కేసులో నిందితులను పట్టుకోవడంలో.. సీరియస్ గా కేసును తీసుకున్నారనే చెప్పాలి.