ఇసుక సరఫరాకు కొత్త పాలసీ పెట్టాం ఎక్కడా అక్రమాలు జరగడం లేదని ప్రభుత్వం చెప్పే మాటలకు అర్ధం లేదని కడప జిల్లా దువ్వూరు సమీపంలో దొరికిన అక్రమ ఇసుక నిరూపిస్తున్నది. ఇక్కడ ఎటు వంటి అనుమతులు లేకుండా ఉన్న12 ఇసుక లారీలను దువ్వూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న 12 లారీలు సీజ్ చేసిన పోలీసులు వాటిని మైనింగ్ అధికారులకు అప్పగించారు. ఈ సంఘటన కడప జిల్లాలో చర్చనీయాంశమైంది.
previous post