మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను దేశం వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం తాను చేసిన పెద్ద పొరబాటు అని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పాకిస్తాన్ లోని ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
తనకు ఆరోగ్యం బాగాలేదని తాను చికిత్స కోసం లండన్ వెళ్లాల్సి ఉందని నవాజ్ షరీఫ్ తన ప్రభుత్వాన్ని కోరారని, ఆయన ఆరోగ్యానికి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందనే కొన్ని సంస్థల నివేదికల ఆధారంగా తాను అనుమతిచ్చినట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.
అప్పటిలో తనకు రోగ నిరోధక శక్తి రోజు రోజుకూ తగ్గిపోతున్నందున చికిత్స చేయించుకోవాల్సి ఉంటుందని నవాజ్ షరీఫ్ తెలిపారు. అయితే ఇప్పుడు ఆయన బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నదని, లండన్ నుంచి ఆయన రాజకీయాలు చేస్తూ తన ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. నవాజ్ షరీష్ పై పాకిస్తాన్ లో అవినీతి ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.