37.2 C
Hyderabad
May 2, 2024 12: 41 PM
Slider మహబూబ్ నగర్

నిందితులు 190 మందిని ఎన్ కౌంటర్ చేయాలి

#KollapurDalit

దళిత యువతి ఎరుకల సరితను బంధించి తొమ్మిది సంవత్సరాల పాటు 5 వేల సార్లు లైంగిక దాడి చేసిన 190 మంది కామాంధులను వెంటనే ఎన్ కౌంటర్ చేయాలని మాలల చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మూలె కేశవులు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దేశవ్యాప్తంగా దళిత మహిళల పైన లైంగిక దాడులు, హత్యలు పెరిగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దిశ కేసులో లైంగిక దాడి చేసి హత్య చేస్తే నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు బాధిత కుటుంబానికి న్యాయం చేశారని, అదే విధంగా సరితపై అత్యాచారం చేసిన వారిని కూడా ఎన్ కౌంటర్ చేయాలని ఆయన కోరారు.

190 మంది పైన కేసు నమోదు చేసి నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా రిమాండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. నిందితులు ఎంతటి ధనవంతులైనా, రాజకీయ పలుకుబడి కలిగిన వారైనా నిక్కచ్చిగా విచారణ చేసి నిర్భయ, దిశ చట్టాలను అమలు చేయాలని ఆయన కోరారు.

లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మూలే కేశవులుతో బాటు ఎరుకల సంఘం నాగర్ కర్నూజల్ జిల్లా అధ్యక్షులు లాల్కోట శ్రీనివాసులు నాయకులు రాజయ్య వెంకట్ రాములు నాగయ్య యాదగిరి తిరపతయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాల్లో అద్భుతమైన ప్రగతి

Satyam NEWS

మహాత్మాగాంధీకి నివాళులు అర్పించిన ఆర్యవైశ్య సంఘ నేతలు

Satyam NEWS

అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి

Satyam NEWS

Leave a Comment