నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో సోమవారం 40 మంది వైసీపీలో చేరారు. 24 డివిజన్లోని ఇందిరమ్మ కాలనీకి చెందిన వీరు, ఉడత మురళి యాదవ్, రాఘవేంద్ర నాయకత్వంలో పార్టీలోకి చేరారు. గడికుమారి, రూతమ్మ, శాంతి కుమారి, లక్ష్మమ్మ, నారాయణమ్మ తదితరులు చేరిన వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా వారు స్థానిక సమస్యలను ఎంపీ ఆదాల దృష్టికి తీసుకువచ్చారు. ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్, స్వర్ణ వెంకయ్య, పిండి సురేష్, పాలకీర్తి రవి, దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సురేష్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.