ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నాణెం విడుదల కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా రూ.100 స్మారక నాణెం విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా, బీజేపీ ఏపి అధ్యక్షురాలు, ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందరేశ్వరి, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ఎంపీలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపి కె.రఘురామకృష్ణంరాజు కార్యక్రమానికి హాజరు కావడం గమనార్హం.