27 C
Hyderabad
May 10, 2024 06: 49 AM
Slider జాతీయం

ఘనంగా ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల

#NTR commemorative

ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నాణెం విడుదల కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా రూ.100 స్మారక నాణెం విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా, బీజేపీ ఏపి అధ్యక్షురాలు, ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందరేశ్వరి, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ఎంపీలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపి కె.రఘురామకృష్ణంరాజు కార్యక్రమానికి హాజరు కావడం గమనార్హం.

Related posts

అన్ని కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం

Satyam NEWS

ప్రభాస్ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ గా ముషిణి విక్రమ్

Satyam NEWS

మిస్టరీ: తిరుమల లో ఉద్యోగి ఆత్మహత్య కు కారణమేంటి?

Satyam NEWS

Leave a Comment