డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడికి బీజేపీ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ తదితర నేతలు యత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. కూన శ్రీశైలం గౌడ్ ని గృహనిర్బంధం చేసి, ఆయన ఇంటికి పోలీసులు తాళం వేశారు. ఈ సందర్భంగా పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.
బీజేపీ కార్యకర్తలపై పోలీసుల జులుం ప్రదర్శించారని బీజేపీ నేతలు ఆరోపించారు. కూన శ్రీశైలం గౌడ్ ను అరెస్ట్ చేసి, జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు.