ప్రతి ఒక్కరూ సాటి మనిషికి సహాయం చేయడం ప్రారంభిస్తే సమాజం మారుతుందని ప్రముఖ సంఘ సేవకురాలు, అనురాగ్ హెల్పింగ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కరుకల అనితారెడ్డి అన్నారు.
75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వరంగల్ లోని స్పందన మెంటల్లీ ఛాలెంజ్ డ్ స్కూల్ లోనూ, లార్డ్ వృద్ధాశ్రమంలోనూ ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడండి
నా పైన నాకు నమ్మకం ఉంది, నేను సాధించగలను, నేను అమితంగా అందరిని ప్రేమించగలను, నావల్ల అవుతుంది
నేను చేయగలను అని నమ్మకమైన మాటలు మీకు మీరే చెప్పుకోండి అని ఆమె అన్నారు. జీవితం అంటేనే ఒక పోరాటం, పోరాడి గెలుపు సాధిస్తాను అని అనుకోండి అంటూ వారికి హితవు పలికారు.