27.7 C
Hyderabad
May 14, 2024 04: 28 AM
Slider మహబూబ్ నగర్

స్వర్గీయ ఇందిరమ్మకు కొల్లాపూర్ లో ఘన నివాళి

indira kolla

భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి కొల్లాపూర్ లో ఘనంగా జరిగింది. కొల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశంలోని పేద ప్రజల కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలను ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేశారు. గరీబీ హటావో కార్యక్రమం ద్వారా దేశంలో పేదరికాన్ని రూపుమాపిన ఉక్కు మహిళ స్వర్గీయ భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అని కాంగ్రెస్ నాయకులు అన్నారు. కొల్లాపూర్ క్రాస్ రోడ్లు దగ్గర గల ఇందిరాగాంధీ విగ్రహానికి నేతలు పూల మాలలు వేసి నివాళి అర్పించారు. తర్వాత వృద్ధులకు బ్రెడ్, పండ్లు పంచారు. ఈ కార్యక్రమంలో tpcc ఆర్గనైజింగ్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి, Tpcc ఆర్గనైజింగ్ సెక్రెటరీ రంగినేని జగదీశ్వరుడు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాము యాదవ్, Dcc జనరల్ సెక్రటరీ కంటే శివన్న, Ex సర్పంచ్ ఎత్తం కృష్ణయ్య, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు ముస్తఫా, ఖాదర్, కలమంద శేఖర్, పెద్ద కొత్తపల్లి మండల అధ్యక్షుడు కృష్ణయ్య, కొల్లాపూర్ మండల అధ్యక్షుడు పరుశరాం, ఎల్లూరు వార్డ్ నెంబర్ పరశురాం, పెద్దకొత్తపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డి కొపుల శివప్రసాద్, గోపాల్, శిలం వెంకటేష్, కాంతారావు, రవి, చెన్నయ్య, హుస్సేన్, ప్రభాకర్ ఎర్ర బాబు, పర్వతనేని రామాంజనేయులు, బెడ బుడగ జంగాల నాయకుడు కొల్లాపూర్ డివిజన్ కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

క్వశ్చన్: రాజధాని భూములు పేదలకా? ఇదేం పద్ధతి?

Satyam NEWS

ఉరి తీయ్.. లేదా రాజీనామా చెయ్

Satyam NEWS

చిన్న అంబానీకి ఎన్ ఫోర్సుమెంటు డైరెక్టరేట్ సమన్లు

Satyam NEWS

Leave a Comment