40.2 C
Hyderabad
April 29, 2024 15: 09 PM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ కోట స్థలాన్ని కబ్జా చేస్తుంటే ఊరుకోం

cong kolla

కొల్లాపూర్ రాజావారు తమ సొంత ఆస్తులు అనుభవించినా అమ్ముకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ప్రజల నుంచి తీసుకున్న కోట స్థలాన్ని ప్రజల ఉపయోగం కోసం కాకుండా ప్లాట్లు చేసి అమ్ముకుంటామంటే ఊరుకునేది లేదని అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. గత మూడు నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో నేడు కొల్లాపూర్ లో అఖిలపక్ష సమావేశం జరిగింది. ప్రధానంగా రాజా బంగ్లా ప్రహరీ స్థలాన్ని సేవ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటైన ఈ అఖిలపక్ష సమావేశంలో ప్రధాన అంశంపై కూలంకషంగా చర్చించారు. టిపిసిసి కార్యనిర్వాహణ కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి, సిపిఎం నాయకులు శివవర్మ, మాజీ మంత్రి జూపల్లి వర్గం టిఆర్ఎస్ ప్రచార కార్యదర్శి పసుపుల నరసింహ, కె తూరి ధర్మ తేజా, మేకల నాగరాజు, బిజెపి మండలాధ్యక్షుడు  సాయి కృష్ణ గౌడ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి జర్నల్ సెక్రటరీ రంగినేని జగదీశ్వర్ కొల్లాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాము యాదవ్, మైనార్టీ సెల్ నాయకులు ముస్తఫా ,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పరశురాం, కంటే శివన్న,శీలం వెంకటేష్, రామాంజనేయులు, ప్రభాకర్, డిష్ రవి, దళిత దండు వ్యవస్థాపక బచ్చలకూర బాలరాజు, సిపిఎం నాయకులు తార సింగ్, భాస్కర్, సలీమ్ తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానెల్

Satyam NEWS

సకాలంలో సీఎంఆర్ పూర్తి చేసే మిల్లర్లపై ఒత్తిడి తగ్గించే చర్యలు

Satyam NEWS

ఏపీలో ఏమీ జరగడం లేదు… అంతా ఎల్లోమీడియా ప్రచారమే

Satyam NEWS

Leave a Comment