కర్నూలు జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో న్యాయవాదులు తోపులాటకు దిగారు. కోర్టులో విధుల బహిష్కరణ విషయంలో వారి మధ్య విభేదాలు తలెత్తాయి. 62 రోజులుగా న్యాయవాదులు కర్నూలులో విధులు బహిష్కరిస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్తో న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు. అయితే విధుల బహిష్కరణ కొనసాగించాలని కొందరు… కోర్టులకు వెళ్లాలని మరికొందరు వాదిస్తుండటంతో న్యాయవాదుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ విభేదాలు తారాస్థాయికి చేరి తోపులాట జరిగింది.
previous post