విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.
16వ తేదీ అర్ధరాత్రి నుంచి 25వ తేదీ వరకు ఇవి అమల్లో ఉంటాయి. విశాఖపట్నం, హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను నగరంలోకి రాకుండా ఇతర మార్గాల ద్వారా పంపిస్తున్నారు.
అలాగే గుంటూరు నుంచి విజయవాడకు వచ్చే వాహనాలు, నగరంలో తిరిగే సిటీ బస్సులకు ట్రాఫిక్ పోలీసులు నిర్దేశిత మార్గాలను సూచించారు.
మూలా నక్షత్రం సందర్భంగా ఈనెల 20వ తేదీ రాత్రి నుంచి 22వ తేదీ ఉదయం వరకు ప్రకాశం బ్యారేజీ మీదకు ఎటువంటి వాహనాలకు అనుమతివ్వడం లేదు.