39.2 C
Hyderabad
May 3, 2024 14: 48 PM
Slider కృష్ణ

పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలు అరికట్టలేరా

#somuveeraju

ఫార్మా కంపెనీల్లో  తరచుగా ప్రమాదాలు జరుగుతున్నా  ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచుగా ఫార్మా పరిశ్రమల్లో  సంభవిస్తున్న ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత ప్రభుత్వ శాఖలు తీసుకున్న చర్యలు కానరావడంలేదని, పరిశ్రమల్లో కార్మికులకు  రక్షణకు సంబంధించిన చర్యలు తీసుకోని  పరిశ్రమల యజమానుల పై ఏం చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. ఫార్మా రంగంలో జరుగుతున్న ప్రమాదాల నివారణకు ముందస్తు తీసుకున్న చర్యలు పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో జరిగిన భారీ ప్రమాదానికి సంబంధించిన కారణాలపై దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని,  బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సోము వీర్రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఈమేరకు బిజెపి రాష్ట్ర కార్యాలయం నుండి  శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Related posts

తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం

Bhavani

18 ఏళ్లుగా షబ్బీర్ అలీ ఇంట్లో విద్యుత్ ఉద్యోగి

Satyam NEWS

ప్రభుత్వానికి లొంగిపోతే అన్ని విధాలా ఆదుకుంటాం

Satyam NEWS

Leave a Comment