26.7 C
Hyderabad
May 3, 2024 10: 32 AM
Slider ముఖ్యంశాలు

స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కృషి

#hujurnagarmla

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కొరకు కృషి చేస్తుందని హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం మన ఊరు,మన బడి,మన బస్తీ,మన  బడి కార్యక్రమంపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు.

శాసనసభ్యుడు  శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలలో మౌళిక వసతులు కల్పించి,పాఠశాలలను బలోపేతం చేసేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దూర దృష్టితో “మన ఊరు –  మన బడి ,మన బస్తీ-మన బడి” కార్యక్రమాన్ని తీసుకు వచ్చినట్లు అన్నారు. మొదటి విడతగా నియోజకవర్గంలో 84 పాఠశాలలను మౌళిక వసతులు కల్పించి పటిష్టం చేయనున్నట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధితో రాష్ట్రం ముందుకు వెళుతోందని,విద్యా రంగంలో కూడా మెరుగైన ఫలితాలు సాధించినట్లు సైదిరెడ్డి తెలిపారు.అక్కడక్కడ కొన్ని చోట్ల పాఠశాలల్లో ఒక్కొక్క పాఠశాలలో ఒక్కో రకమైన చిన్న సమస్యలు ఉన్నాయని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ  పాఠశాలలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతుందని అన్నారు.

మూడు దశల్లో మన ఊరు మన బడి

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక హంగులతో సమగ్రంగా తీర్చిదిద్దేందుకు మన ఊరు-మన బడి,మన బడి-మన బస్తీ కార్యక్రమం 3 దశలలో చేపట్టనున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో ఈ కార్యక్రమానికి 3 సంవత్సరాలకు గాను 7,289 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం కేటాయించిందని అన్నారు.

మొదటి విడతగా 2021-22-సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలం లోని ప్రాథమిక,ప్రాథమికోన్నత,ఉన్నత పాఠశాలల నుండి అధిక నమోదు కలిగిన 9123 (35 శాతం)  ప్రభుత్వ  పాఠశాలలలో మౌళిక వసతులకు 3497 కోట్ల 62 లక్షల రూపాయల కోట్ల ఖర్చుతో మరింత మెరుగు పరచే బృహత్తర కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు.

ఇందులో ప్రభుత్వ  పాఠశాలల్లో  శిథిలావస్థకు చేరిన గదులను తొలగించి వాటి స్థానంలో క్రొత్త గదులను నిర్మించడం,ప్రహారీ గోడలు,కిచెన్‌ షెడ్లు,హై స్కూల్లో డైనింగ్‌ హాల్ నిర్మాణాలు చేపట్టడం,తాగునీటి సౌకర్యం,రన్నింగ్ వాటర్ సౌకర్యంతో టాయిలెట్ల నిర్మాణాలు,భవనాలకు రంగులు వేయడం,మరమ్మతులు చేయడం,కావాల్సిన ఫర్నీచర్‌ ఏర్పాటు, గ్రీన్‌ చాక్‌బోర్డులు,విద్యుద్దీకరణ, డిజిటల్‌ పరికరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సైదిరెడ్డి తెలిపారు.  

ప్రతి మండలంలో 2021-22 విద్యా సంవత్సరానికి 35 శాతం పాఠశాలలను అభివృద్ధి చేయనున్నామని అన్నారు. ఆయా మండలాలు,పట్టణాల్లో అత్యధిక మంది విద్యార్థులున్న పాఠశాలలను గుర్తించి వాటిని అభివృద్ధి చేయానున్నామని,దీనికోసం పనులు చేసేందుకు గాను ఒక మండలానికి ఒకే ఏజేన్సీని ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు.

హుజూర్ నగర్  నియోజకవర్గ వ్యాప్తంగా పాఠశాలలలో గుర్తించిన పనులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలను ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు.ప్రణాళికలు సిద్దం అయిన పిదప చేపట్టాల్సిన పనులు ప్రారంభం అయిన తర్వాత తాను స్వయంగా ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తానని అన్నారు.

పాఠశాల నిర్వహణ కమిటీ రెండు చొప్పున బ్యాంకు ఖాతాలను తెరవాల్సి ఉంటుందని,ఒక ఖాతాలో ప్రభుత్వం ఇచ్చే డబ్బులను పాఠశాల నిర్వహణకు అవసరమగు ఖర్చులకు జమ చేయాలని,మరొక ఖాతాలో ప్రజలు, పూర్వ విద్యార్థులు,విద్యాభిమానులు, దాతలు తదితరులు ఇచ్చే విరాళల సొమ్మును జమచేయాలన్నారు.

ఖాతాల వివరాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచి మరిన్ని విరాళాలను ప్రోత్సహించాలన్నారు.ఎవరైనా దాత ర 2 లక్షల రూపాయలు ఇచ్చినట్లైతే పాఠశాల కమిటీలో సభ్యుడిగా చేర్చుకోవచ్చని,10 లక్షలు అంతకు మించి ఎక్కువ విరాళం ఇస్తే పాఠశాలలో ఒక తరగతి గదికి దాత పేరు,లేదా దాత సూచించిన పేరు పెట్టాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజలను,ఎన్‌ఆర్‌ఐ లు, పూర్వ విద్యార్థులను భాగస్వాములను చేయాలని సైదిరెడ్డి సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు,అధికారులు, నాయకులు,పాఠశాల ఎస్ ఎస్ ఎం చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

విజయనగరం పైడితల్లి ఆలయ విస్తరణ కు తొలగిన అడ్డంకులు

Bhavani

టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ నామినేషన్ దాఖలు

Satyam NEWS

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో చుక్కెదురు

Bhavani

Leave a Comment