జ్యుడీషియల్ అధికారుల నివాస భవనాల కోసం ఖమ్మం అర్బన్ మండలం బురహాన్ పురం లోని సర్వే నెం. 98 లో కేటాయించిన స్థలాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. టి. శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జ్యుడీషియల్ అధికారుల క్వార్టర్ ల కొరకు ప్రభుత్వం 3.08 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని తెలిపారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి పరిశీలన సందర్భంగా జిల్లా కోర్టు సీఏఓ సూర్యనారాయణ మూర్తి, సెంట్రల్ నజీర్ రాధే శ్యామ్, రెవిన్యూ అధికారులు తదితరులు ఉన్నారు.