అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం లో శ్రీశ్రీశ్రీ కామాక్షి సమేత ట్రేత్రేశ్వర స్వామి మహాశివ రాత్రి బ్రహ్మోత్సవాలు భారీగా నిర్వహిస్తున్నారు.ఇక్కడ పరశురాముడు ప్రతిష్టించిన శివలింగంగా ప్రసిద్ధి చెందగా, శివ కేశవులు ఇద్దరూ కొలువైన ప్రాంతంలో సర్వపాపాలు బహుదానదిలో స్నానమా చరిస్తే పోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.జిల్లా నలుమూలల నుంచి వచ్చే వేలాది మంది భక్తుల కోసం ఆర్టీసి వారు ప్రత్యేక బస్సులు నడుప నున్నారు.
వివిధ స్వచ్చంద సంస్థల వారు త్రాగునీరు, అన్న ప్రసాదాలు,మజ్జిగ భక్తులకు పంపిణీ చేసే ఏర్పాట్లు చేశారు.మడుగులో స్నానాలు చేసే భక్తుల కోసం భారీ కెట్లు ఏర్పాటు చేశారు.పోలీస్ కంట్రోల్ రూమ్,ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు.
భక్తులు స్వామి వారిని క్యూ లైన్ లో వెళ్లే విధంగా బారికేడ్లు నిర్మించారు.ఎండ బారిన పడకుండా షామియాణాలు ఏర్పాటు చేశారు.శనివారం మహా శివరాత్రి వేడుకలు,ఆదివారం శ్రీశ్రీశ్రీ కామాక్షి సమేత త్రేత్రేశ్వర స్వామి కళ్యాణం,సోమవారం
రథోత్సవం వేడుకగా భక్త జన సమూహం మధ్య నిర్వహించ నున్నారు.రాత్రుళ్ళు భక్తుల సౌకర్యార్థం వివిధ సాంసృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.