ఈ నెల 20వ తేదీన విజయనగరం అయోధ్య మైదానంలో హైందవ శంఖారావం జరగబోతోంది. ఈ మేరకు హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో శంఖారావం కు ఏర్పాటు జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా ఆహ్వానిస్తోంది.. సమితి సభ్యులు. ఈ మేరకు అదే రోజు జరగబోయే కార్యక్రమ సమయసారిణి కూడా యోజన చేసింది… సమితి.
“ప్రియమైన హిందూ బంధువులారా నవంబర్ 20 వ తేదీ ఉదయం 6.30 నుండి 12.30 వరకు హోమం. మధ్యహ్నం 3.30 నుండి 5 గం వరకు కోట నుండి అయోధ్య మైదానం వేదిక వరకు ర్యాలీ గా వెళ్ళి సాయంత్రం స్థానిక అయోధ్య మైదానం లో 50,000 మంది తో హైందవ శంఖారావం భారీ బహిరంగ సభ నిర్వహించ దానికి హిందూ ధర్మ రక్షా సమితి సన్నాహాలు చేస్తుంది ” అని పేర్కొంది కూడా ఈ సందర్భంగా సమితి నిర్వాహకులు పార్ధశారధి మాట్లాడుతూ హిందువుల ఐక్యత కి ఎంతగానో దోహద పడుతుందని తెలిపారు.