29.7 C
Hyderabad
May 6, 2024 03: 53 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో విలేకరులకు అవమానం

#wanaparthy

వనపర్తిలో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళిన విలేకరులకు ఈరోజు అవమానం జరిగింది. అధికారులు అతిగా ప్రవర్తించారు. గుర్తింపు కార్డు చూపాలని గేటు దగ్గర పోలీసులు విలేకరులను అడిగారు. గుర్తింపు కార్డు చూపిన తర్వాత విలేకరులను వదిలారు. కాని నాయకులను గుర్తింపు కార్డు అడగలేదు. నాయకులను లోపలికి వదిలారు. మంత్రి నిరంజన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన సందర్బంగా విలేకరులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. కలెక్టర్ కార్యాలయం బయట ప్రజలు గుంపులుగా ఉన్న దగ్గర విలేకరులకు మీడియా పాయింట్ఏర్పాటు చేశారు. అదే విదంగా ఒక అధికారి విలేకరులు ఉన్న దగ్గరికు చేరుకుని విలేకరులు ఇక్కడ ఉండరాదని, బయటకు వెళ్ళాలని చెప్పారు. ఆ సమయంలో అధికారి రూరల్ ఎస్ఐ తో మాట్లాడారు. విలేకరులను బయటకు పంపాలని ఎస్ఐని కోరారు. న్యూస్ కవర్ చేయడానికి ఇబ్బంది ఉంటుందని విలేకరులు చెప్పినా పట్టించుకోలేదు. జిల్లా ఎన్నికల అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషనర్, ఢిల్లీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ట్విట్టర్, మెయిల్ ద్వారా పిర్యాదు పంపామని విలేకరి యాదగిరి రమేష్ సెల్ నంబర్ 9966084549 తెలిపారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

పి డి ఎస్ యు రాష్ట్ర కమిటీలో మఠంపల్లి మండల కొత్త తండ వాసి

Satyam NEWS

ఇసుక విధానంపై టీడీపీ నిర‌స‌న ర్యాలీ

Sub Editor

మేళ్ళచెరువు శివాలయానికి గ్రానైట్ బహూకరణ

Satyam NEWS

Leave a Comment