మంత్రి సిదిరి అప్పలరాజుకు విశాఖపట్నంలోని శారదా పీఠం వద్ద ఘోర పరాభవం జరిగింది. మంత్రి సిదిరి అప్పలరాజు ఆశ్రమం లోపలికి వెళ్తుండగా అక్కడ బందోబస్తులో ఉన్న సిఐ ఆయనను అడ్డుకున్నారు. వెళ్లాలనుకుంటే మంత్రి లోపలకి వెళ్ల వచ్చునని అయితే ఆయన అనుచరులను మాత్రం లోపలికి అనుమతించేది లేదని సిఐ తేల్చి చెప్పారు. మంత్రి బ్రతిమలాడుతుంటే సిఐ మాత్రం దురుసుగా గెట్ వేసి లోనికి వెళ్లారు. వెళ్తే మంత్రి లోపలకి వెళ్లాలని, లేకుంటే లేదని సిఐ చెప్పారు. దాంతో మంత్రి పరువు పూర్తిగా పోయింది. తనకు క్షమాపణలు చెప్పాలని మంత్రి అప్పలరాజు, అనుచరులు సిఐని డిమాండ్ చేశారు. సి ఐ క్షమాపణలు చెప్పక పోవడంతో మంత్రి అప్పలరాజు అలిగి వెనక్కి వెళ్లిపోయారు.
previous post