నిర్భయ దోషులున్న తిహార్ జైలులో ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. కట్టు దిట్టమైన భద్రతకు మారు పేరైన తీహార్ జైలు లో ఈ సంఘటన జరగడం పై పలు విమర్శలు వెలువడుతున్నాయి.ఓ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడైన రాజేష్ అనే ఖైదీ జైలు గదిలోనే ఆత్మహత్యకు యత్నించాడు. అది గమనించిన జైలు వార్డర్లు వెంటనే రాజేష్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన తిహార్ జైలు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు
previous post