కరోనా కారణంగా విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఇంటర్మీడియట్ అడ్మిషన్ల గడువు ను పెంచాలని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో మేనేజ్ మెంట్ అసోసియేషన్(టి.పి.జె. ఎం. ఏ) ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి మేరకు ఈనెల 12 వరకు అడ్మిషన్ల గడువు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమార్ జలీల్ ఆదేశాలు సోమవారం జారీ చేశారు.
టి.పి.జె. ఏం. ఏ చేసిన విజ్ఞప్తికి స్పందించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అడ్మిషన్ల గడువు పెంచి అవకాశాన్ని కల్పించినందుకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమార్ జలీల్ కు తెలంగాణ రాష్ట్ర ప్రవేట్ జూనియర్ కళాశాల మేనేజ్ మెంట్ అసోసియేషన్ (టి.పి.జె.ఎం. ఏ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు, శ్రీ గాయిత్రి విద్యా సంస్థల చైర్మన్ సురగౌని శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. నేటికీ అడ్మిషన్లు పొందని విద్యార్థులు తక్షణమే విద్యాసంవత్సరం నష్టపోకుండా అడ్మిషన్లు తీసుకోవాలని సురగౌని శ్రీనివాస్ గౌడ్ కోరారు.