ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం. సీతారామమూర్తి నేడు హైకోర్టులో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధాన న్యాయమూర్తికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో రాష్ట్ర హెచ్ ఆర్సీ కమిషన్ ఛైర్మన్ తో బాటు జ్యుడిషియల్ సభ్యులు దండే సుబ్రహ్మణ్యం, నాన్ జ్యుడిషియల్ సభ్యులు డా. శ్రీనివాసరావు గోచిపాత కూడా పాల్గొన్నారు.
previous post