26.7 C
Hyderabad
May 3, 2024 09: 18 AM
Slider హైదరాబాద్

బీర్ బాటిల్స్‌ కోసం దారుణ హత్య

#Brutal murder

హైదరాబాద్‌ శివారు మీర్‌పేట పరిధిలో దారుణం జరిగింది. బీర్ బాటిల్స్‌ కోసం ఓ వ్యక్తితో గొడవ పెట్టుకుని.. అతన్ని కత్తితో కిరాతకంగా హత్య చేశారు. మృతుడ్ని సాయి వరప్రసాద్‌గా నిర్ధారించారు పోలీసులు. జిల్లెలగూడ నుంచి సాయి వరప్రసాద్‌ బీరు బాటిల్స్‌ కొనుక్కుని వెళ్తున్నాడు.

ఈ క్రమంలో కొందరు యువకులు.. అతన్ని అడ్డుకుని బాటిల్స్‌ తమకు ఇచ్చేయాలని డిమాండ్‌ చేశారు. అందుకు అతను ససేమీరా అనడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కత్తితో సాయిపై ఆ యువకులు దాడి చేశారు.

రక్తపు మడుగులో అక్కడికక్కడే సాయి కుప్పకూలిపోయాడు.బీర్‌ బాటిల్‌ హత్య ఉదంతంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన మీర్ పేట్ పోలీసులు.. పల్లె నితీష్ గౌడ్, కిరణ్ గౌడ్,సంతోష్ యాదవ్,పవన్‌లను నిందితులుగా నిర్ధారించారు.

Related posts

ట్రాక్టర్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ ల సమస్యలను పరిష్కరిస్తాం

Satyam NEWS

ఏపీ అగ్రికల్చర్ MPEO ల రెన్యువల్ జివో వెంటనే విడుదల చెయ్యాలి

Satyam NEWS

కాకతీయ కాల్వలో ఇద్దరు యువకుల గల్లంతు

Satyam NEWS

Leave a Comment