దళితుల ఆర్థిక స్వావలంబన కోసం దళిత బందు ఎంతగానో ఉపయోగపడుతుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. హబ్సిగూడ డివిజన్ కు చెందిన దళితులకు దళిత బంధు లబ్ధిదారులు మంగళవారం ఎమ్మెల్యేను కలుసుకుని హబ్సిగూడ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో శాలువాలు కప్పి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హత గల ప్రతి దళిత కుటుంబానికి దళిత బందు అందేలా చూస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు గరిక సుధాకర్, గాయం శ్రీధర్ రెడ్డి, కంచర్ల సోమిరెడ్డి, నంది కంటి శివ, శ్రీనివాస్ ,ఏర్పుల నరేష్, సందీప్, చంద్రశేఖర్, పూర్ణ చందర్ ,తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి