ఐఎన్టియుసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల 188 వ వర్కింగ్ సమావేశం హైదరాబాదు లోని బర్కత్ పుర లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి.సంజీవరెడ్డిని సభ్యులు ఘనంగా సన్మానించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ ఐ ఎన్ టి యు సి నాయకుడు,సౌత్ సెంట్రల్ జోనల్ యూజర్స్ నెంబర్ యరగాని నాగన్న గౌడ్, నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య,హుజూర్ నగర్ మండల అధ్యక్షుడు మేళ్లచెరువు ముక్కంటి, నేరేడుచర్ల బ్లాక్ ఐఎన్టియుసి అధ్యక్షుడు ఎస్ డి ముస్తఫా,హుజుర్ నగర్ పట్టణ ఐ ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి పోతనబోయిన రామ్మూర్తి, తదితర నాయకులు డాక్టర్ జి.సంజీవరెడ్డి ని శాలువాతో సత్కరించి, సన్మానించారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్