గద్వాల జిల్లాలోని జోగులాంబ అమ్మవారి 18వ వార్షిక బ్రహ్మోత్సవాలపై ఆలయ పాలకమండలి వేగవంతమైన ప్రచారాన్ని కల్పిస్తుంది. ఈ మేరకు వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఒకవైపు అవసరమైన ఏర్పాట్లను చేస్తూనే మరొకవైపు పాలకమండలి చైర్మన్ ఆలయ ఈవో పలువురు ప్రముఖులు కలిసి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తున్నారు.
బ్రహ్మోత్సవాలకు ప్రముఖులు రావడం ద్వారా దేవస్థానం కు మరింత ప్రచారంతోపాటు ప్రయోజనాలు చేకూరుతాయని భావిస్తున్న ఆలయ పాలకమండలి పలువురు మంత్రులను ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నారు ఇందులో భాగంగా శుక్రవారం రాజ్యసభ సభ్యుడు( ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి తండ్రి ) విజయేంద్ర ప్రసాద్ ను అలాగే భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు
డీకే అరుణ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకటరామిరెడ్డి’ తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ నరసింహచార్యులు లను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఈవో పురేందర్ ఆలయం ముఖ్యఅర్చకులు ఆనంద్ శర్మ పాలకమండలి సభ్యులు జయన్న అనంతేశ్వర్ రెడ్డి’ హరిబాబు తదితరులు ఉన్నారు.