సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న బోనాల మహోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం అందించారు. బుధవారం ప్రగతి భవన్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఆలయ కార్యనిర్వహణాధికారి మనోహర్ రెడ్డి, దేవాలయ కమిటీ చైర్మన్ సూరిటి కామేశ్, సభ్యులు, దేవాలయ పూజారులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ కు అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు.
previous post