23.7 C
Hyderabad
May 8, 2024 03: 26 AM
Slider ముఖ్యంశాలు

ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులకు ఆహ్వానం

#NTR

నందమూరి తారక రామారావు శత జయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్‌ లిటరేచర్‌, సావనీర్‌ అండ్‌ వెబ్‌సైట్‌ కమిటీ మే 20 సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌, కూకట్‌పల్లి, హౌసింగ్‌ బోర్డులో గల కైతలాపూర్‌ మైదానంలో ఎన్టీఆర్‌పై ప్రత్యేకంగా రూపొందించిన శకపురుషుడు సావనీర్‌, ‘జయహో ఎన్టీఆర్‌’ వెబ్‌సైట్‌ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అతిధులుగా ఎన్‌.టి రామారావు కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించారు. ఎన్టీఆర్‌ కుమారులు నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ సహకారంతో సోమవారం కమిటీ చైర్మన్‌ టి.డి.జనార్థన్‌, డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందీశ్వరి, జూనియర్‌ ఎన్టీఆర్‌, నందమూరి జయకృష్ణ,

నందమూరి మోహనకృష్ణ, గారపాటి లోకేశ్వరి, కంఠంనేని ఉమాశ్రీనివాస్‌ ప్రసాద్‌, నందమూరి కళ్యాణ్‌ చక్రవర్తి, నందమూరి కళ్యాణ్‌రామ్‌, కాట్రగడ్డ రుక్మాంగదరావు (ఎన్టీఆర్‌ బావమరిది)ని, ఇంకా ఇతర కుటుంబ సభ్యులను కలిసి ఆహ్వాన పత్రాలు అందించి వారందరూ తమ కుటుంబ సభ్యులతో సహా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరడం జరిగిందని మాజీ ఎమ్మెల్సీ , ఎన్టీఆర్ సావనీర్ కమిటీ ఛైర్మన్ టి.డి జనార్దన్  తెలిపారు.

Related posts

రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ కు పాత్రుని వలస విద్యార్థుల ఎంపిక

Satyam NEWS

తెలంగాణ లో పెద్ద ఎత్తున ఐపిఎస్ ల బదిలీ

Satyam NEWS

వందల కోట్ల మోసానికి పాల్పడ్డ సాహితీ ఇన్ఫ్రా ఎండీ అరెస్ట్

Bhavani

Leave a Comment