శ్రీకాకుళం రూరల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత్రుని వలస విద్యార్థులు రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ పోటీలకు ఎంపిక అయ్యారు. పాత్రుని వలస ఉన్నత పాఠశాలకు చెందిన తోణంగి నరేంద్ర కుమార్, మూకళ్ళ సోమశేఖర్, బాణాల సాయి శ్రీనివాసరావు అండర్ 14 విభాగం హ్యాండ్ బాల్ లో ఎంపిక అయ్యారు. అండర్ 17 విభాగం హ్యాండ్ బాల్ లో గొడ్డు శంతన్ , ఈపు లక్ష్మణరావు ఎంపిక అయ్యారు.
వీరితో బాటు అండర్ 17 విభాగం హాకీ లో తట్ట మల్లేశ్వరరావు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ.డి.వి ప్రసాద్, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు రాజనాల సతీష్ రాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. వీరు ఈనెల 28 నుండి సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో జరగనున్న పోటీల్లో పాల్గొంటారని అన్నారు. వీరి ఎంపిక పట్ల పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ మొయ్యిల వాసుదేవరావు మరియు పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు.