తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కి నందమూరి కుటుంబంలో జరుగనున్న వివాహానికి ఆహ్వానం అందింది. దివంగత నందమూరి హరికృష్ణ తనయ నందమూరి సుహాసిని తన కుమారుడు హర్ష వివాహానికి రావల్సిందిగా పొంగులేటిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి శుభలేఖ ను అందజేశారు.
ఖచ్చితంగా వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులిద్దరికీ తన ఆశీస్సులను అందజేస్తానని ఈ సందర్భంగా పొంగులేటి తనకు శుభలేఖ ను అందచేసిన సుహాసినితో పేర్కొన్నారు.