ఐపీఎల్ మెగా వేలం జనవరి మొదటి వారంలో జరుగుతుందని బీసీసీఐ ఇదివరకే ఐపీఎల్ ఫ్రాంచైజీలకు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం 2022 జనవరి మూడో వారందాకా మెగా వేలాన్ని నిర్వహించడం కుదరదంటూ వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై త్వరలో ఓ క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.
అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి సంబంధించిన సమస్యలను సకాలంలో పరిష్కరించకపోవడం వల్లే ఈ మెగా వేలం వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ యాజమాన్యానికి సంబంధించిన అంశంపై కమిటీ నిర్ణయం ఇంకా ఫైనల్ కాలేదంటూ వార్తలు వెలువడుతున్నాయి.
ఈ నిర్ణయం వచ్చే వరకు వేలం తేదీలను ఖరారు చేయడం సాధ్యం కాదని తెలుస్తోంది. దీని తర్వాత లక్నో, అహ్మదాబాద్ జట్లు కూడా ఐపీఎల్ వేలానికి ముందు చెరో 3 ఆటగాళ్లను కొనుగోలు చేసుకోవాల్సి ఉంది.