30.7 C
Hyderabad
April 29, 2024 06: 49 AM
Slider ఆదిలాబాద్

వధూవరులకు ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా పట్టువస్త్రాలు

#TDP Adilabad

తెలుగుదేశం పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ అధికార ప్రతినిధి పోతారెడ్డి కుమార్తె వివాహం ఇటీవల ఇచ్చోడ లో జరిగింది. కరోనా  లాక్డౌన్ కారణంగా ఈ వివాహానికి తెలుగుదేశం పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటరీ అధ్యక్షులు గుల్లపెల్లి ఆనంద్ రాలేకపోయారు.

నేడు ఆయన పోతారెడ్డి ఇంటిని సందర్శించి ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా వధూవరులకు పట్టు వస్త్రాలు బహూకరించారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనాయకులు నారా లోకేష్ ఆలోచనతో కార్యకర్తల సంక్షేమనిధి ఏర్పాటు చేశారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. 

ఏదో ఒక విధంగా కార్యకర్తలకు సహాయం చేస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఏ.రాజరెడ్డి, రాష్ట్ర తెలుగు  మహిళా కార్యదర్శి గ్నాన సుధా, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి మహబూబ్ పాల్గొన్నారు.

ఇంకా పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శులు తాళ్లపెల్లి రాజేశ్వర్, పెరుగు ఆత్మారాం, అధికార ప్రతినిధులు మీర్ సాదిక్ అలీ, పోతారెడ్డి, రఫీక్, పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి  చంద్రమోహన్, ఇచ్చోడ మండల అధ్యక్షుడు బొజ్జ లక్ష్మణ్, సిరికొండ మండల అధ్యక్షుడు ఎస్కే అలీ, గుడిహాత్నూర్ మండల అధ్యక్షులు మహేందర్ పాల్గొన్నారు.

Related posts

మావోయిస్టుల చెర నుంచి రాకేశ్వర్ సింగ్ విడుదల

Satyam NEWS

ఘనంగా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా పుట్టిన రోజు

Satyam NEWS

నటరాజ రామకృష్ణ శతజయంతి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment