యుద్ధ భయం, శత్రు భయం లేకుండా ఇరాన్ పటిష్టంగా తయారు కావాలని ఆ దేశ సుప్రీం నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీ అన్నారు.శనివారం వైమానిక దళం కమాండర్స్, సిబ్బందితో ఆయన మాట్లాడుతూ యుద్ధాన్ని నిరోధించడానికి, శత్రువుల బెదిరింపులను ఎదుర్కోవడానికి ఇరాన్ యువత సిద్ధంగా ఉండాలని ,ఏ సమయం లోనైనా యుద్దానికి సిద్ధమయ్యేలా తమ దేశం ఇంకా బలంగా తయారు కావాలని అయన పిలుపునిచ్చారు.
1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత దశాబ్దాలుగా అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ ఇరాన్ బలమైన వైమానిక దళాన్ని తయారు చేసుకోగలిగిందన్నారు.