విద్యా దధాతి వినయం..విద్య నేర్చుకుంటే వినయం వస్తుందని పెద్దల మాట.మరి మాడు పగిలే ఎండలో…కళ్లు బైర్లు కమ్మే భానుడు భగభగలో హైస్కూల్ కు మన విద్య శాఖా మంత్రి గారు వస్తున్నారు…ఎన్.సీ.సీ పిల్లలు స్వాగతం పలకాలన్న ఆదేశాలతో …హైస్కూలు పిల్లలు అందునా..
బాలికలు..ఎండను సైతం లెక్క చేయకుండా… తమ విద్యశాఖ మంత్రి కి స్వాగతం పలికారు.ఉదయం పదిగంటలకు”జగనన్న ఆణిముత్యాలు” కార్యక్రమంకు సదరు మంత్రి అదేనండీ విద్యా శాఖ మంత్రి బొత్స త్యనారాయణ రావడంతో… అనుకున్న సమయం కన్నా ముందే ఎన్ సీ.సీ స్టూడెంట్స్..భగభగమండే భానుడు ప్రతాపం చూపిస్తున్న…
హైస్కూల్ మాస్టారు ఆదేశాలను శిరసావహించారు..బాలికలు.ఇంతకీ ఏ స్కూల్…ఎక్కడ…ఏ మంత్రో చెప్ప లేదు కదా. అదేనండీ ఏపీ రాష్ట్ర విద్య శాఖమంత్రి చీపురు పల్లి ఎంఎల్ఏ బొత్స సత్యనారాయణ ఉంటున్న విజయనగరం కస్పా హైస్కూల్ లో.