39.2 C
Hyderabad
May 3, 2024 13: 53 PM
Slider అనంతపురం

భార్యాభర్తల విభేదాలే హత్యకు కారణమా?

భార్యాభర్తల మధ్య చెలరేగిన తీవ్ర విభేదాలే అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ లో లెక్చరర్ దారుణ హత్యకు దారితీసిందని పోలీసుల ప్రాధమిక విచారణలో వెల్లడయింది. ఈ మధ్యనే గుంటూరు నుంచి అనంతపురం బదిలీ కావడంతో సుమంగళి భర్త సురేష్ తో విభేదాలు వచ్చాయి. దాంతో సుమంగళి కోర్టులో కేసు వేసింది. సుమంగళి కోర్టులో కేసు వేయడంతో ఆమె భర్త తన భార్య తమపై కేసు వేసిందని విషయం జీర్ణించుకోలేకపోయాడు. అందుకోసమే సురేష్ భార్య సుమంగళి గొంతు కోశాడంటూ బంధుమిత్రులు ఆరోపిస్తున్నారు. ప్రిన్సిపల్ ఛాంబర్ లో అటెండెన్సు వేయటానికి వెళుతుండగా సుమంగళి భర్త సురేష్ కత్తితో ఆమెపై దాడి చేయడం జరిగింది. ఓవైపు క్లాసులు జరుగుతుండగా టీచర్స్ అందరూ క్లాస్ రూమ్ లోనే ఉన్నారు. సుమంగళి అరుపు వినగానే అందరూ క్లాస్ రూమ్ లో నుంచి వచ్చి చూడగా అక్కడ సుమంగళి రక్తం మడుగులో పడి ఉండటం చూసి పక్కనున్న స్టూడెంట్స్ టీచర్లు సుమంగళి భర్తను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గొంతు కోసిన సుమంగళి భర్త సురేష్ వెంటనే పోలీసుల ముందు లొంగిపోయాడు.

సత్యం న్యూస్.నెట్, అనంతపురం

Related posts

బంగ్లాదేశ్‌లో మత ఘర్షణల కుట్ర బట్టబయలు..

Sub Editor

దేవాలయ అభివృద్ధి పనులను పరిశీలించిన MLA

Satyam NEWS

బొబ్బిలి లో “ఇదేం ఖర్మ మన రాష్ఠ్రానికి” ప్రొగ్రాం

Satyam NEWS

Leave a Comment