సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మెళ్ళచెర్వు మండల కేంద్రంలోని శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి వారి దేవాలయంలో జరుగుతున్న ప్రహరీగోడ నిర్మాణం, దేవాలయం చుట్టూ డ్రైనేజి, ఇతర అభివృద్ధి పనులను ఆదివారం నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పరిశీలించారు.
అనంతరం దేవాలయంలో ప్రత్యేక అభిషేక, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు బోగాల కొండారెడ్డి, జిల్లా కో ఆప్షన్ సభ్యులు షేక్ ఇమ్రాన్, సాముల వెంకటరెడ్డి, గురుస్వామి, మాశెట్టి రాములు తదితరులు పాల్గొన్నారు.