ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం నూకాలంపాడు గ్రామంలో కొలువుదీరి ఉన్న శ్రీ సోమలింగేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ కార్యక్రమానికి వైరా నియోజకవర్గ ఎంఎల్ఏ లావుడియా రాములు నాయక్ తనయుడు ఇన్కమ్ టాక్స్ కమిషనర్ లావుడియా జీవన్ లాల్ విచ్చేసి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ సర్పంచ్ ఇంజం శేషగిరిరావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఏన్కూర్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బానోత్ సురేష్ నాయక్, రైతు బంధు అధ్యక్షులు మేడా ధర్మారావు, సర్పంచ్ లు శివ, వినోద్, బాలాజీ, శ్రీకాంత్, మాజీ మండల అధ్యక్షులు గిద్దగిరి సత్యనారాయణ, నరసింహారావు, భూక్యా ధర్మ, సుధాకర్, బాజీ, చాంద్ పాషా పలువురు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టియుడబ్ల్యూజే, టీజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక చంద్రశేఖర్, సభ్యులు చనుమోలు వెంకటేశ్వర్లు పూజా కార్యక్రమాల్లో పాల్గొని జీవన్ లాల్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
previous post