29.7 C
Hyderabad
May 7, 2024 05: 31 AM
Slider ముఖ్యంశాలు

ఆసుపత్రులపై ఐ‌టి దాడులు

#itraids

ఖమ్మం నగరంలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.  నగరంలోని పలు ఆసుపత్రులలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.  వైరా రోడ్‌లోని బిలీఫ్ హాస్పిటల్ లో ఐటీ అధికారులు వస్తున్నారని సమాచారంతో ఆస్పత్రి యాజమాన్యం కీలకమైన పత్రాలు, డాక్యుమెంట్లను ఆసుపత్రి వెనుక భాగం నుంచి బయటకు తరలించినట్లు సమాచారం. ఆస్పత్రి సిబ్బందితో వారు కీలక పత్రాలు ఇతర ప్రాంతాల్లో భద్రపరిచినట్లు సమాచారం. ఖమ్మం నగరంలో ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇతర వ్యాపారస్తులు జంకుతున్నారు. మరో వైపు ప్రముఖ కిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ గురునాధరావు ఆసుపత్రి పై కూడా దాడులు చేశారు. ఐతే ముందస్తు సమాచారంతో అందరు జాగ్రత్త పడ్డట్లు తెలుస్తున్నది. ఐ‌టి దాడుల నేపాధ్యంలో జిల్లాలోని ప్రముఖ ఆసుపత్రులన్నీ దాదాపుగా మూతపడటం గమనార్హం.

Related posts

ప్రయివేటు కాలేజీ ఫీజుల జీవో కొట్టివేత

Satyam NEWS

గన్నవరం టీడీపీ నాయకులపై హత్యాయత్నం కేసులు

Satyam NEWS

జనతా గ్యారేజ్ : ఉత్తర ప్రదేశ్ లో పువ్వు గుర్తుకు రిపేరు

Satyam NEWS

Leave a Comment