మిడిల్ ఈస్ట్ ప్రాంతాలకు వెళ్లే వారికి విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. ఖతర్ లో ఫుట్బాల్ వరల్డ్ కప్ పోటీలు ఈ నెల మూడో వారంలో ప్రారంభం కానున్నాయి. పోటీలు వీక్షించేందుకు ప్రయాణికుల తాకిడి కూడా బాగా పెరిగింది. దుబాయికి టిక్కెట్టు ధర రూ.25 వేల నుంచి రూ.30 వేలవరకుండగా, దోహాకు తిరిగొచ్చేందుకు రూ.46 నుంచి రూ.85 వేలుగా ఉంది. దీంతో హోటళ్ల టారిఫ్ కూడా బాగా ఎక్కువైంది. ఈ రెండు దేశాలు ఫుట్బాల్ పోటీలు తిలకించేందుకు వీలుగా విసా అవకాశాలు కల్పించాయి. ఈ నెలాఖరులో వెళ్లేందుకు చెన్నై నుంచి దోహాకు రూ.46 నుంచి రూ.90 వేల వరకు, దుబాయికి రూ.25 నుంచి రూ.30 వేలు, అబుదాబికి రూ.23 నుంచి రూ.41 వేలు, షార్జాకి రూ.23 నుంచి రూ.27 వేలు, దమామ్కి రూ.26 నుంచి రూ.29 వేలు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ‘ఎఫ్ఐఎఫ్ఏ’ వరల్డ్ కప్ పోటీలు 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. యూఏఈ, సౌదీలో విసాలో బాగా సడలింపులు చేసిన నేపథ్యంలో ఎక్కువ మంది యూఏఈ కానీ, సౌదీలో కానీ దిగి అక్కడినుంచి ఖతర్కు వెళ్లేందుకు మొగ్గు చూపిస్తున్నారు.
previous post
next post